Showing posts with label పారాయణం. Show all posts
Showing posts with label పారాయణం. Show all posts

Monday, 29 August 2016

చంద్రుడు ఇచ్చే ఫలితాలు - దోషనివారణకు చంద్రకవచం

చంద్రుడు
---------------------------------------



రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


భోజనం _ నిద్ర విషయంలో సరియైన విధంగా వ్యవహరించకుంటే చంద్రుని అనుగ్రహాన్ని కోల్పోతారు. లేదా చంద్రుని అనుగ్రహం లేకుంటే ఆ విషయాలలో సరియైన విధంగా ఉండలేరు.

భోజనం - నిద్ర అనేవి పునాది లాంటివి.వీటి విషయంలో మనం వ్యవహరించే విధానాన్ని బట్టే ప్రస్తుత మన మానసిక స్థితి ఉంటుంది.

ఆనందంగా ఉండాలనుకునే వ్యక్తి ఆరోగ్యం - పవిత్రత - అవసరం - సమయం అనే వాటిని దృష్టిలో ఉంచుకుని భుజించాలి. కాన్సియస్ తో భుజించాలి.

పాపం లేదా దోషాలు పెరుగుతున్న ఫుడు మనిషి స్పృహ లేకుండా తింటాడు.

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు.అలాగే అదృష్ట సమయం నడుస్తున్నపుడు ఎలా ప్రవర్తిస్తాడు. అనే దానిని "మహాభారతం " వివరించింది.

ఆ సందర్భంగా ఆహార అలవాట్ల ప్రస్తావన కూడా ఉంది.

ఉదాహరణకు...

ఒక మనిషికి వ్యతిరేక సమయం నడుస్తున్నపుడు.....

శ్లో|| యదాయ మతి కష్టాని సర్వాణ్యుపనిషేవతే| 
      అత్యర్థ మపివా భుంక్తే నవా భుంక్తే కదాచన॥


అంటే...

తనకు హాని కలిగించే విరుద్ధమైన ఆహార పదార్థాలను తింటూ ఉంటాడు.

ఒకప్పుడు జిహ్వ చాపల్యం వల్ల అతిగా తింటాడు. మరొకప్పుడు పూర్తిగా తినడాన్నే మానుకుంటాడు.

(పండ్లు ఫలాలు లాంటి ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాలు ఇంట్లో మురిగి పోతుండగా చూస్తాడు కాని వాటిని తినాలనిపించదు.
పవిత్రపరిచే దేవుని ప్రసాదాలు చీమలు పడుతున్నా చూస్తాడు కాని, తాను తినడు - ఇతరులకు పంచి పెట్టడు. ఆయా విషయాల్లో అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది.కాని ప్రకాశవంతంగా లేకపోవడం వల్ల విరుద్ధంగా ప్రవర్తిస్తాడు.)

శ్లో || దుష్టాన్న మిషపానంచ యదన్యోన్య విరోధిచI 
       గురుచాప్య మితం భుంక్తే నాతి జీర్ణేZపివాపున:॥

తినకూడని, త్రాగకూడని పదార్థాలను సేవిస్తాడు. ఒకదానితో ఒకటి సరిపడని పదార్ధాలను తింటాడు.
బలం తక్కువ బరువు ఎక్కువైన వాటిని తింటూ ఉంటాడు.అంతేకాక, అంతకు ముందు తిన్నది జీర్ణం కాకముందే మరల పొట్టను నింపుతూ ఉంటాడు.

ఉదాహరణగా రెండు శ్లోకాలను మాత్రమే ఇచ్చాను.

నిద్ర కూడా వీలైనంత తొందరగా పడుకుని సూర్యోదయం లో పే నిద్ర లేచే ప్రయత్నం చేయాలి.

 అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు....

జ్యోతిషశాస్త్ర దృష్ట్యా మానసిక శక్తికి చంద్రుడు కారకత్వాన్ని వహిస్తాడు.

జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉంటే దానర్థం... అతడు గత జన్మల నుండే మానసికంగా ఉత్సాహంగా ఉండడాన్ని అభ్యాసం చేస్తున్నాడన్నమాట!

ఎవరికైతే జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేడో అతడు గత జన్మల నుండే దు:ఖపడడాన్ని - నిరుత్సాహాన్ని - నెగిటివ్ థింకింగ్ ను అభ్యాసం చేస్తున్నట్లు అర్థం.

ఈ జన్మంతా వ్యతిరేక ఆలోచనలతో గడిపి మరణిస్తే వచ్చే జన్మ జాతకంలో చంద్రుడు పూర్తి వ్యతిరేక స్థానంలో ఉంటాడు.

ఒక వ్యక్తి చేసిన మంచి - చెడు అభ్యాసాలు సంస్కార రూపంలో జీవుని వెన్నంటి ఉంటాయి. ఆ సంస్కారాలనూ, ఆ సంస్కారాల వల్ల ఆతడు పొందబోయే ఫలితాలను జాతకం విశ్లేషిస్తుంది.

కాబట్టి ప్రస్తుత స్థితి అనేది గత కర్మల ఫలితం.భవిష్యత్తు మరింత బాగుండాలంటే అది మనం చేసే వర్తమాన కర్మలను బట్టి ఉంటుంది.

మనం చేసే కర్మలన్నింటిని ప్రధానంగా మనస్సే ప్రేరేపిస్తూ ఉంటుంది.

... అలా సరియైన విధంగా ప్రేరేపించే మానసిక శక్తిని - పాజిటివ్ థింకింగ్ ను - మంచి భావాలు వ్యాప్తి చేయడం - ప్రేమపంచడం - భోజనం, నిద్ర విషయంలో క్రమశిక్షణ - బావులూ చెరువులు త్రవ్వించడం - జల సంరక్షణ -  ఉత్సహంగా సంతోషంగా ఉండడం - వినయం - ప్రసన్నత- మాతృభక్తి - మంచి కీర్తి - మాతృభాషలో ప్రావీణ్యం - హాస్యాన్ని ఆస్వాదించడం ..... మొ॥ మంచి లక్షణాలు చంద్రుని అనుగ్రహం వల్ల లభిస్తాయి.

ఈ క్రింద "చంద్రకవచం" ఫైల్ ఇస్తున్నాను .దీని పారాయణం వల్ల చంద్ర సంబంధ దోషాలు తొలగడమే కాక చంద్ర సంబంధ ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.

(ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటుంది. ఉపయోగపడే ఏ పనులు మనకు చేయాలని అనిపించదో అందులోనే అదృష్టం దాగి ఉంటుంది.

సాధారణంగా మనస్సు ఎప్పుడూ ప్రయోజనం లేని పనుల వైపే లాగుతుంది.

ఈ క్రింద ఇచ్చే చంద్రకవచాన్ని డౌన్లోడ్ చేసుకోరు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా  తన కోసం కాదన్నట్లు అలా జరుపుతూ వెళతారే కాని, చదవాలని అనిపించదు.
కాని ప్రతి సోమవారం చదివితే ఒక సంవత్సరం వరకు దీని ఫలితం ఏమిటో అర్థమౌతుంది.అదే సంస్కృత శబ్దాలకు ఉన్న మహాత్మ్యం.)


1. చంద్ర కవచం. ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోండి


2.లేదా ఇక్కడ నొక్కి చంద్రకవచం డౌన్లోడ్ చేసుకోండి



           ( ఓపికగా చదివినవారికి)
                ధన్యవాదములతో

           గురుమంచి రాజేంద్రశర్మ

         శ్రీ రవీంద్ర జ్యోతిషాలయం


Saturday, 27 August 2016

నజర్ ( దృష్టి దోషం లేదా నరఘోష ) తొలిగిపోవడానికి స్తోత్రం

నజర్ ( దృష్టి దోషం ) తొలిగిపోవడానికి రెమెడీ


రచన :- గురుమంచి రాజేంద్రశర్మ

దృష్టిదోషం అంటే ఏమిటో కొంత వివరంగా తెలుసుకుందాం !

శబ్ద ,స్పర్శ ,రూప ,రస ,గంధాలు అనే వాటిని పంచతన్మాత్రలు అంటారు.

" బహిర్గతమైన ఆలోచనలే లేదా భావాలే శబ్దాలు ."

మనం మంచి శబ్దాలు(మాటలు) విన్నా మాట్లడినా మంచి ఫలితాలు రావడాన్ని గమనిస్తున్నాము.

అలాగే దీనికి వ్యతిరేకంగా చెడుశబ్దాలు విన్నా మాట్లడినా చెడు ఫలితాలు రావడాన్ని కూడా గమనిస్తున్నాము.

అలాగే పవిత్రంగా జీవించే మహాత్ముల స్పర్శ కూడా ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో రమణ మహర్షి , రామకృష్ణ పరమహంస , వివేకానందుడు వంటి మహాత్ములతో సహచర్యం చేసిన వారిని పరిశీలిస్తే అర్థమయ్యే విషయమే. 

అలాగే దుర్జన సాంగత్యం - వారి స్పర్శ మనని పతనం వైపూ లేదా కష్టాల వైపు నడిపిస్తుంది.

( మూడవది అయిన "రూపం "లోని విభాగమే దృష్టి కాబట్టి దీని గూర్చి చివరగా చెప్పుకుందాము.)

ఇక రసం అంటే రుచి - ఆహారం

"ఆహార శుద్ధౌ సత్వ శుద్ధి సత్వ శుద్ధౌ ధృవా స్మృతి . " అని శాస్త్రం.

మనం తినే ఆహారం కూడా మన గుణాలను ప్రభావితం చేస్తుంది.

కొన్ని ఆహార పదార్థాలు తింటే మనలో సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది.

మరి కొన్ని ఆహార పదార్థాలు మన శరీరంలో రక్త ప్రసారాన్ని పెంచి అనారోగ్యం - ఆవేశం - కోపం పెరగడానికి కారణమౌతాయి.

ఇంకా కొన్ని ఆహార పదార్థాలు తమో గుణాన్ని పెంచి సోమరితనాన్ని - బద్ధకాన్ని - నిద్రమత్తును కలిగిస్తాయి.

ఇక గంధం అంటే వాసన

సువాసనలు - దుర్వాసనలు కూడా మన ఆలోచనలను ప్రభావితం చేసి తద్వారా మనచర్యలను ప్రేరేపించి మంచి - చెడులకు కారణమౌతాయి.

ఇక మూడవదైన రూపం సంబంధించిన వాటిలో వచ్చేది దృష్టి .

ఒకానొక గాఢమైన భావంతో కూడిన చూపును దృష్టి అంటాము. అది మంచిది కావచ్చు! చెడ్డది కావచ్చు!

మంచిదైతే పాజిటివ్ ఫలితాలను - చెడ్డదైతే నెగిటివ్ ఫలితాలను పొందుతాము.


దేవతల, మహాత్ముల, మన శ్రేయస్సును బలంగా కోరుకునే తల్లిదండ్రులు మొదలైన వారి "అనుగ్రహ దృష్టి - శుభ దృష్టి " మనకు మంచిని కలిగిస్తుందనేది తెలిసిన విషయమే!

ఎక్కువగా మౌనంగా ఉండే రమణ మహర్షి , కంచి పరమాచార్య వంటి మహాత్ములు తమను అనుగ్రహంతో చూసినపుడు "ఆ సమయంలో తమ మనసు కొన్ని క్షణాలు ఆలోచనా రహితమైన అవ్యక్త ఆనందానుభూతికి లోనై " తమ ఆలోచనలూ - జీవితం పూర్తిగా అభివృద్ధికర మార్గంలో ప్రయాణించినట్లు చాలా మంది భక్తులు చెబుతుంటారు.

రామకృష్ణ పరమహంస ఏకాంతంలో చేసిన స్పర్శ - అనుగ్రహ దృష్టి ప్రసారం వివేకానందునిలో ఎటువంటి మార్పులను కలిగించిందో వివేకానందుని చరిత్రను చదివిన వారికి తెలిసిన విషయమే !

అలాగే దీనికి వ్యతిరేకంగా మనని ద్వేషించే వారి, మనమంటే ఈర్శ్య కలిగిన వారి , అపవిత్రంగా జీవించే వారి, మనం అభివృద్ధి చెందకూడదు అని బలంగా కోరుకునే వారి దృష్టి ని "నర ఘోష - నజర్ - లేదా దృష్టి దోషం" అంటారు.

ఇది మనకు చెడును కలిగిస్తుందని పూర్వం నుండి పెద్దలు చెప్పే విషయం.

ఇటువంటి దృష్టి దోషాన్ని - నరఘోష ను (నజర్ ను) తొలగించే " దత్త మాలా మంత్రం " అనే ఫైల్ ను ఈ క్రింద ఇస్తున్నాను .దీన్ని ప్రతిరోజు 11 సార్లు చదవడం వల్ల ఎటువంటి దృష్టి దోషమైనా తొలిగిపోతుంది. బాగా బిజీగా ఉండేవారు కనీసం ఒకసారైనా చదువుకోండి.

సూర్యోదయం కన్నా ముందే స్నానం చేసి చదివితే మరింత మంచి ఫలితం ఉంటుంది.


1.దత్తమాలా మహా మంత్రం (ఇక్కడ నొక్కండి )

2.లేదా ఇక్కడ నొక్కి "దత్తమాలా మంత్రం "డౌన్లోడ్ చేసుకోండి


 ఇకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.

"నిరంతరం ప్రవహించే నీటి ప్రవాహానికి ఏ దోషం అంటదు. "  అలాగే   ఎప్పుడూ క్రియాశీలంగా -  ఏక్టివ్ గా జీవించే వ్యక్తులకు కూడా ఏ దోషాలు అంటవు.

" ఆగిన నీరే మురికిగుంటగా మారి దోషాలకు నిలయమౌతుంది."

అలాగే సోమరితనం - బద్ధకం - అధిక సుఖలాలసత ...మొ॥వి  మనని అభివృద్ధి మార్గంలో ఆగేటట్లుగా చేసి దోషాలకు కారణమౌతాయి. ఈ దుర్లక్షణాలను వీలైనంత తొందరగా వదిలించుకుంటే ఎప్పటికీ ఏ దోషాలు మనని అంటకుండా ఉంటాయి.

                                     స్వస్తి

                       (ఓపికగా చదివిన వారికి )
                            ధన్యవాదములతో

                 గురుమంచి రాజేంద్రశర్మ





Wednesday, 24 August 2016

అన్యోన్య దాంపత్యం కోసం జపాలు


కొంతమంది భార్యాభర్తల మధ్య చీటికిమాటికి తగాదాలు , గొడవలు , అభిప్రాయభేదాలు ఏర్పడుతుంటాయి.

అటువంటి వారు వారిమధ్యగల అభిప్రాయభేదాలు తొలిగి , అన్యోన్య దాంపత్యసౌఖ్యం ఏర్పడడం కోసం ఈ క్రింది సూచనలను పాటించండి.

1. ప్రతిరోజు సూర్యోదయం లోపు స్నానం చేయాలి.

2 . సాయంకాలం కూడా స్నానం చేయాలి.

3. అలాగే రెండు పూటల బ్రష్ చేసుకోవాలి.

4. టీవీ సీరియల్లు , టీవీ ఎక్కువగా చూడడం మానివేయాలి.

5. బెడ్ రూమ్ పరిశుభ్రంగా , నీట్ గా ఉంచుకోవాలి. 
( దాంపత్య సౌఖ్యాన్ని ప్రసాదించే గ్రహం " శుక్రుడు". జాతకంలో శుక్రుడు అనుకూలంగా లేని వారు బెడ్ రూం ను చిందరవందరగా ఉంచుకుంటారు.)

6. ఇంటిలో వెంట్రుకల చిక్కులు కనిపించకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. (ఇది పితృదోషాన్ని సూచిస్తుంది.)

7. ఉదయం 8 am లోపు టిఫిన్
మధ్యాహ్నం 1-2 pm మధ్య లంచ్
రాత్రి 8.30 pm లోపే డిన్నర్ పూర్తి చేసుకోవాలి.
(అకాల భోజనం జాతకంలోని చంద్ర దోషాన్ని సూచిస్తుంది.)

8. ఇంటి టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
(టాయిలెట్స్ పరిశుభ్రంగా లేకపోవడం రాహు- శని - చంద్ర సంబంధ దోషాలను సూచిస్తుంది.)

9. ఈ క్రింది లింక్ నుండి దాంపత్య సౌఖ్య జపాలు ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి రోజు అందులో సూచించిన విధంగా జపం చేయండి.




                                స్వస్తి

అన్యోన్య అనుకూల దాంపత్యసౌఖ్యాభివృద్ధిరస్తు
                        ధన్యవాదములతో
                   గురుమంచి రాజేంద్రశర్మ



Tuesday, 23 August 2016

రవిగ్రహ ఫలితాలు - అనుగ్రహం పొందడానికి స్తోత్రాలు

రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


సూర్యడు
---------------------------------------
జ్యోతిషశాస్త్ర దృష్ట్యా ఆత్మ శక్తికి సూర్యుడు కారకత్వాన్ని వహిస్తాడు.

ఆత్మశక్తి ఉద్దీపనం చెందిన వ్యక్తి మిగతా శక్తులను సులభంగా పొందుతాడు.

తండ్రిని గౌరవించని వ్యక్తి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండని వ్యక్తి, సమయ పాలన విషయంలో నిర్లక్ష్యం గల వ్యక్తుల జాతకాలను పరిశీలించినపుడు వారికి సూర్యుడు వ్యతిరేక స్థానాలలో ఉండడాన్ని మనం గమనిస్తాము.

సూర్యుని అనుగ్రహాన్ని పొందిన వ్యక్తులకు ఈ లోకంలో సాధించలేనిది అంటూ ఉండదు.
ఎందుకంటే సూర్యుని అనుగ్రహం వల్ల ఆత్మ ప్రకాశవంతమౌతూ ఎప్పుడూ కాన్సియస్ తో ఉంటాడు. అటువంటి వ్యక్తి అన్ని దోషాలనుండి విముక్తమౌతూ అన్ని విషయాల్లోనూ సరియైన ప్రవర్తనను కలిగి ఉంటాడు.

అలాగే ఒక వ్యక్తికి నాయకత్వ లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటేనే లభిస్తాయి.
ఒక నాయకుడు ఎప్పుడూ సూర్యుడిలా నియమబద్ధంగా - ధర్మబద్ధంగా నడుచుకుంటాడు. అప్పుడు మిగతావారు అతనికి అడ్జెస్ట్ అవుతూ అనుసరిస్తూ ఉంటారు.
సూర్యుని అనుగ్రహం లేని వ్యక్తి తాను అసంతృప్తిని అనుభవిస్తూ ఇతరులను తృప్తి పరిచే ప్రయత్నం చేస్తుంటాడు. దానివల్ల చివరకు తాను తృప్తిగా ఉండలేడు - అలాగే ఇతరులనూ సంతృప్తి పరచని స్థితి ఏర్పడుతుంది.

ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి అనే విషయం సూర్యున్ని చూసి నేర్చుకోవచ్చు!
సూర్యుడు ఇతరుల కోసం ప్రాత:కాలంలో ఉదయించడం లేదు. ఇతరుల కోసం అస్తమించడం లేదు. అది తన ధర్మం కాబట్టి ఈ పనులన్ని చేస్తున్నాడు. అప్పుడు లోకమంతా అతని ప్రవర్తనను అర్థం చేసుకుని తమ జీవితాలను అందుకు అనుగుణంగా మార్చుకుని సూర్యున్ని అనుసరిస్తుంది.
ఒక నాయకుడు కూడా సూర్యుని లాగే వ్యవహరించాలి.
తాను హృదయపూర్వకంగా నమ్మిన సిద్ధాంతాన్ని నియమబద్ధంగా ధృడమైనదీక్షతో ఆచరిస్తూ వెళుతున్నా కొద్దీ లోకం కూడా క్రమంగా అతన్ని అర్థం చేసుకుని అనుసరిస్తుంది.
విజయం పొందిన ఏ నాయకుల చరిత్రను చూసినా ఈ విషయం సత్యమైనదని అర్థమౌతుంది.

సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది.

రథస్యైకచక్రం భుజగనమితా సప్తతురగాః
నిరాలంబో మార్గశ్చరణవికలసారథిరపి
రవిర్యాతే వాన్తంప్రతిదినమపారస్యనభసః
క్రియా సిధ్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణె
అంటే ....
(పురాణాలు వర్ణించిన ప్రకారం )సూర్య భగవానుడు ప్రయాణించే రథానికి ఒకే చక్రం ఉంటుదట. ఆ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతుంటాయి.ఇక ఆ గుర్రాలను పట్టి ఉంచే పగ్గాలేమో పాములు. ప్రయాణించే మార్గం...ఆధారం లేని ఆకాశ మార్గం. ఆ రథాన్ని నడిపే   రథ సారథి తొడల నుండి క్రింది భాగం లేని అంగ వైకల్యం కల అనూరుడు.
ఇన్ని కష్టాలతో కూడిన ప్రయాణం చేస్తుా  కూడా ఆకాశంలో సూర్యుడు  గతి - నియమం - ధర్మం తప్పడం లేదు. మహాత్ములకు ఏ ఉపకరణాలు లేకున్నా సమస్త కార్యాలు సిద్ధిస్తాయని పై శ్లోకం యొక్క అర్థం.

ఇలాంటిదే సూర్యవంశ సంజాతుడైన రాముని గూర్చిన మరో శ్లోకం ఉంది.

విజేతవ్యా లంకా, చరణ తరణీయో జలనిధిః
విపక్షః పౌలస్త్యః, రణభువి సహాయాశ్చ కపయహః | 
పదాతిర్మర్త్యోZసౌ,సకలమవధీద్రాక్షసకులమ్
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణైః||

భావము :- తాను జయించవలసినది ఏదో సామాన్యమైన పట్టణాన్ని కాదు. లంకానగరాన్ని.
అది నూరుయోజనాల సముద్రానికి అవతల ఉంది. శత్రుదుర్భేద్యమైనది.
గెలవడంమాటఅటుంచి అసలు అక్కడకు చేరుకోవడమే అసాధ్యమైనపని.
సముద్రాన్ని దాటడానికి తనవద్ద ఎటువంటి ఉపకరణాలు , అంటే
విమానాలు , నౌకలు వంటివి లేవు.పాదాలే శరణ్యం. ఒకవేళ చేరుకున్నా , శత్రువు సామాన్యుడు కాడు. రావణబ్రహ్మ. అత్యంత బలవంతుడు.ప్రకృతినే శాసించినవాడు, తపోసంపన్నుడు,వరసంపన్నుడు,
అష్టదిక్పాలకులను అదుపులో పెట్టుకున్నవాడు. త్రిమూర్తులలో
ఇద్దరికి అత్యంత ప్రియమైనవాడు. బ్రహ్మగారికి స్వయానా మనుమడు.
శివుడికి అత్యంత ప్రియభక్తుడు, బ్రాహ్మణుడు, ప్రతిరోజూ 9 కోట్ల శివలింగాలకు
స్వయంగా అభిషేకంచేసేవాడు, వేదపండితుడు,  ఇతన్ని
యుద్ధరంగంలో జయించాలి. మామూలువాణ్ణికాదు. పోనీ తనకేమైనా యుద్ధరంగంలో
సహాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళాఅంటే, చంచలస్వభావంకల కోతులు.
పోనీ తనపరిస్థితి చూస్తే, 14 సం. నుండి సరైన నిద్రాహారములు సరిగ్గా లేనివాడు.
మామూలు రాజకుమారులకుండే అన్ని సౌకర్యములకు దూరమైనవాడు.
పినతల్లి వల్ల కలిగిన అవమానభారంతో, భార్యావియోగంతో మానసికంగా
గడ్డుస్థితిని ఎదుర్కొంటున్నవాడు. ఇక తనలాంటివాడే తమ్ముడు.
అయోధ్యనుండి ఎలాంటి సైనికసహకారం లేదు.
ఇటువంటిస్థితిలో ఉన్న శ్రీరామచంద్రుడు,విజయం సాధించి
ఈభూమిమీద దుష్ట రాక్షసుడనేవాడిని మిగల్చకుండా చంపేసాడు.
కాబట్టి మహాత్ములు  లభించిన ఉపకరణాలనూ - అనుచరులనూ - పరిస్థితులనే తమకు అనుకూలంగా మార్చుకుని లక్ష్యాన్ని - విజయాన్ని సాధించగలరు.
ఆదే విధంగా నిజమైన నాయకులు ఎలాంటి అనుచరులూ - ఉపకరణాలు ఉన్నా , ఎన్ని కష్టాలు ఎదురైనా వాటినే తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధిస్తారు.
ఇదిగో ఇలాంటి ధృతిని - నాయకత్వ లక్షణాలను ప్రసాదించేది సూర్యుడు.

ఇంకా
సమయ పాలన - ఇతరులను గౌరవించడం - దానగుణం - మాటకు కట్టుబడి ఉండడం -పితృభక్తి - ఆరోగ్యం పట్ల శ్రద్ధ - నాయకత్వ లక్షణాలు - అంత:శుద్ధి - హుందా స్వభావం - ఆత్మ విశ్వాసం - నిజాయితీ - రాముని లా ధర్మం,సత్యం విషయంలో కఠిన ప్రవర్తన... మిగతా విషయాలలో సున్ని తత్వం  - ఆర్థిక పరమైన స్పృహ లేదా అభిమానం - ఇతరుల వద్ద చెయ్యి చాపక పోవడం ..... మొ|| మంచి లక్షణాలు సూర్యుని అనుగ్రహం ఉంటే లభిస్తాయి.

ఈ క్రింది ఆదిత్య హృదయం ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. దీనిని పారాయణం చేయడం వల్ల ఆయా మంచి లక్షణాలు మనలో వృద్ధి పొందుతాయి.ఈ ఆదిత్య హృదయం రావణునిపై విజయం సాధించడం కోసం అగస్త్య మహర్షి స్వయంగా రామునికి ఉపదేశించాడు. ఇది చాలా మహత్యం కలిగింది.దీనిని ప్రతిరోజూ చదివితే మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


ఈ క్రింది  "సూర్య కవచం " ఫైల్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా మహిమాన్వితమైన కవచం. దీనిని శ్రద్ధగా పారాయణం చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం లభించడమే కాక, పితృ దోషాలు జాతకంలో ఉన్న వారికి ఆ దోష ప్రభావం తగ్గి అన్ని విషయాలలో చక్కని అభివృద్ధి ఏర్పడగలదు.


ఇంకా ఇతర స్తోత్రాలు ఆదివారం చదవ వలసినవి.ఈ క్రింది ఫైల్స్ పై నొక్కండి.



                           స్వస్తి
                                 ధన్యవాదములతో
                         గురుమంచి రాజేంద్రశర్మ


Monday, 22 August 2016

తొందరగా ఫలితమిచ్చే ధనలక్షీ స్తోత్రం

తొందరగా ఫలితమిచ్చే ధనలక్షీ స్తోత్రం

ఈ స్తోత్రమ్ లో 6 శ్లోకాలు ఉన్నాయి.
ఒక్కొక్క శ్లోకం చదువుతూ 10 రూ/ ఒక బాక్స్ లో వేయాలి. అలా 6 శ్లోకాలు చదివి 60 రూ/ వేయాలి.
ఇలా నియమబధ్ధంగా చేస్తూ ఉంటే నెలకు 1800  రూ/
సంవత్సరానికి 21,600 రూ/ పొదుపు అవుతాయి.
ఈ డబ్బులను స్థిరంగా ఉండే విధంగా బంగారం,ఇంటి నిర్మాణం,లేదా ఇంటి ప్లాట్ లో పెట్టుబడి పెట్టాలి.

ఇలా ప్రతిరోజూ జరిగే పొదుపు ధ్యానం తర్వాత తర్వాత గొప్ప శక్తి గా వృద్ధి చెంది మన జీవితాలలో మంచి ఆర్థికాభివృద్ధికి కారణమౌతుంది.

ఒక సంవత్సరం చేసి చూస్తే ఈ నియమం మహాత్మ్యం మనకు అర్థమౌతుంది.

స్వస్తి
ధన్యవాదములతో
గురుమంచి రాజేంద్రశర్మ

ఉపయోగపడే ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి.

ఈ క్రింది లింక్ నొక్కి "క్షిప్ర ఫల ధనలక్ష్మీ స్తోత్రం" ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.






ధనప్రాప్తికి రామాయణం

ఈ క్రింది లింక్  ద్వార ధనప్రాప్తికి రామాయణం అనే ఫైల్ డౌన్ లోడ్ చేసుకోండి. దీన్ని ప్రతిరోజూ ఉదయం పారాయణం చెయ్యడం వల్ల ఆదాయం పెరుగుతుంది. రోజూ వీలు కానివారు కనీసం ప్రతి శనివారం అయినా చదవండి.

శుభం భవతు

స్వస్తి

ధన్యవాదములతో

గురుమంచి రాజేంద్రశర్మ


ధనప్రాప్తికి రామాయణం











.

Sunday, 21 August 2016

డబ్బు నిలకడ ఉండాలంటే.....


డబ్బు నిలకడ ఉండాలంటే పాటించవలసిన రెమిడి.
-----------------------------------------------------------


చాలా మందికి డబ్బు నిలకడ ఉండడం లేదు అనేది సమస్య.

"ఎంతో కష్టపడుతున్నాను. ఆదాయం కూడా పర్వాలేదు.కాని ఇన్ని సంవత్సరాలు ఫలితం చూస్తే మిగిలింది కూడా పెద్దగా లేదు." అనే బాధ ఉంటుంది.

సంపాధించిన డబ్బు అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్స్ లో ఖర్చు చేయడం వల్లనో,  ఇతర కుటుంబ సభ్యుల అభివృద్ధికి ఖర్చు కావడం వల్లనో,  ఇతరులకు అప్పులు -జామీనులు ఇచ్చి మునగడం వల్లనో, లేదా ఉన్న ఆదాయాన్ని మరింత ఆశతో అనవసర వ్యాపారాల వైపు మళ్లించి నష్టపోవడం వల్లనో ... ఇలా ఏదో ఒక కారణం వల్ల డబ్బు నిలకడ తగ్గుతుంది.

పోని,తెలివి లేక నష్టపోయారా? అంటే అదీ కాదు. వీరే ఎంతో మందికి సలహాలు ఇచ్చి - సహాయాలు చేసి ఇతరుల అభివృద్ధికి కారణమౌతారు.ఆ లాభపడ్డ వ్యక్తులెవరూ వీరి సహాయాన్ని గుర్తించే స్థితిలో ఉండరు. పైగా ఒకింత వ్యతిరేక భావనతోనే ఉంటారు.

జ్యోతిష దృక్కోణంలో విశ్లేషించినపుడు గతజన్మ సంబంధించిన జాతక దోషాలు ఉండవల్లగానీ, లేదా వంశపారంపర్య పితృ దోషాలు ఉండడం వల్లనో ఇలాంటి పరిస్థితి ఉంటుంది.

అంటే ... (గత జన్మలలో)వీరు కానీ లేదా వీరి పూర్వీకులు గాని ..."ఉన్న పుణ్యఫలం కన్న లేదా చేసిన శ్రమ కన్నా అధికంగా సుఖాలు అనుభవించడం వల్ల ఇలాంటి దోషాలు వస్తూ ఉంటాయి."

" అంటే కాలానికి శ్రమను లేదా పుణ్యఫలాన్ని బాకిపడి (అప్పు పడి)ఉంటారన్న మాట!

ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు ఈ క్రింది లింక్ ను నొక్కి "సిద్ధలక్ష్మీ స్తోత్రం"ను డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు ఉదయం స్నానం తరువాత చదువుకోవాలి. ఇది మనను పూర్తిగా పాజిటివ్ గా ఉంచే బీజాక్షరాలతో కూడిన స్తోత్రం. ఎలాంటి అనుమానాలు లేకుండా స్నానం తరువాత వెంటనే ఈ స్తోత్రం చదువవచ్చు. ఈ స్తోత్రం చదివిన తరువాత ఎలాంటి కోరిక లేకుండా నిష్కామంగా ఒక 4 నుండి 6 కిలోమీటర్లు నడిచి రావాలి (వాకింగ్ చేయాలి).
ఇది ఇంతకు ముందు ఎంతో మంది పరీక్షించి అనుకూల ఫలితాలు పొందిన రెమిడి.

1) స్తోత్ర పారాయణం వల్ల క్రమంగా పాజిటివ్ మార్గంలో ప్రయాణించి వేగంగా పుణ్యఫలం వృద్ధి పొందుతుంది.

2) తరువాత చేసే వాకింగ్ వల్ల శ్రమశక్తి వృద్ధి చెంది విధికి (లేదా కాలానికి) ఉన్న బుణం చెల్లింపు జరిగి వేగంగా అభివృద్ధి జరుగుతుంది.

ఇది అనుభవ పూర్వకంగా కేవలం ఒక మూడు నెలల లోనే బుుజువయ్యే రెమిడి.

రెమిడిలోని రెండు విషయాలను (స్తోత్ర పఠనం - వాకింగ్) ఆచరించినప్పుడే పూర్తి ఫలితం ఉంటుంది. వాకింగ్ కు అవకాశం లేని వారు కోరిక లేకుండా ఏదైనా గుడికి వెళ్లి 108 లేదా 41 ప్రదక్షణాలు చేయవచ్చు.

ఈ రెమిడి పాటించడం మొదలు పెట్టిన తరువాత మన హృదయంలో పెరుగుతున్న శాంతి మనం సరియైన మార్గంలోనే వెళుతున్నట్లు సూచిస్తుంది.

                         స్వస్తి
           ధన్యవాదములతో
       గురుమంచి రాజేంద్ర శర్మ.
ఈ క్రింది లింక్ నొక్కి "సిద్ధలక్ష్మీ స్తోత్రం" ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి.