నజర్ ( దృష్టి దోషం ) తొలిగిపోవడానికి రెమెడీ
రచన :- గురుమంచి రాజేంద్రశర్మ
దృష్టిదోషం అంటే ఏమిటో కొంత వివరంగా తెలుసుకుందాం !
శబ్ద ,స్పర్శ ,రూప ,రస ,గంధాలు అనే వాటిని పంచతన్మాత్రలు అంటారు.
" బహిర్గతమైన ఆలోచనలే లేదా భావాలే శబ్దాలు ."
మనం మంచి శబ్దాలు(మాటలు) విన్నా మాట్లడినా మంచి ఫలితాలు రావడాన్ని గమనిస్తున్నాము.
అలాగే దీనికి వ్యతిరేకంగా చెడుశబ్దాలు విన్నా మాట్లడినా చెడు ఫలితాలు రావడాన్ని కూడా గమనిస్తున్నాము.
అలాగే పవిత్రంగా జీవించే మహాత్ముల స్పర్శ కూడా ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో రమణ మహర్షి , రామకృష్ణ పరమహంస , వివేకానందుడు వంటి మహాత్ములతో సహచర్యం చేసిన వారిని పరిశీలిస్తే అర్థమయ్యే విషయమే.
అలాగే దుర్జన సాంగత్యం - వారి స్పర్శ మనని పతనం వైపూ లేదా కష్టాల వైపు నడిపిస్తుంది.
( మూడవది అయిన "రూపం "లోని విభాగమే దృష్టి కాబట్టి దీని గూర్చి చివరగా చెప్పుకుందాము.)
ఇక రసం అంటే రుచి - ఆహారం
"ఆహార శుద్ధౌ సత్వ శుద్ధి సత్వ శుద్ధౌ ధృవా స్మృతి . " అని శాస్త్రం.
మనం తినే ఆహారం కూడా మన గుణాలను ప్రభావితం చేస్తుంది.
కొన్ని ఆహార పదార్థాలు తింటే మనలో సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది.
మరి కొన్ని ఆహార పదార్థాలు మన శరీరంలో రక్త ప్రసారాన్ని పెంచి అనారోగ్యం - ఆవేశం - కోపం పెరగడానికి కారణమౌతాయి.
ఇంకా కొన్ని ఆహార పదార్థాలు తమో గుణాన్ని పెంచి సోమరితనాన్ని - బద్ధకాన్ని - నిద్రమత్తును కలిగిస్తాయి.
ఇక గంధం అంటే వాసన
సువాసనలు - దుర్వాసనలు కూడా మన ఆలోచనలను ప్రభావితం చేసి తద్వారా మనచర్యలను ప్రేరేపించి మంచి - చెడులకు కారణమౌతాయి.
ఇక మూడవదైన రూపం సంబంధించిన వాటిలో వచ్చేది దృష్టి .
ఒకానొక గాఢమైన భావంతో కూడిన చూపును దృష్టి అంటాము. అది మంచిది కావచ్చు! చెడ్డది కావచ్చు!
మంచిదైతే పాజిటివ్ ఫలితాలను - చెడ్డదైతే నెగిటివ్ ఫలితాలను పొందుతాము.
దేవతల, మహాత్ముల, మన శ్రేయస్సును బలంగా కోరుకునే తల్లిదండ్రులు మొదలైన వారి "అనుగ్రహ దృష్టి - శుభ దృష్టి " మనకు మంచిని కలిగిస్తుందనేది తెలిసిన విషయమే!
ఎక్కువగా మౌనంగా ఉండే రమణ మహర్షి , కంచి పరమాచార్య వంటి మహాత్ములు తమను అనుగ్రహంతో చూసినపుడు "ఆ సమయంలో తమ మనసు కొన్ని క్షణాలు ఆలోచనా రహితమైన అవ్యక్త ఆనందానుభూతికి లోనై " తమ ఆలోచనలూ - జీవితం పూర్తిగా అభివృద్ధికర మార్గంలో ప్రయాణించినట్లు చాలా మంది భక్తులు చెబుతుంటారు.
రామకృష్ణ పరమహంస ఏకాంతంలో చేసిన స్పర్శ - అనుగ్రహ దృష్టి ప్రసారం వివేకానందునిలో ఎటువంటి మార్పులను కలిగించిందో వివేకానందుని చరిత్రను చదివిన వారికి తెలిసిన విషయమే !
అలాగే దీనికి వ్యతిరేకంగా మనని ద్వేషించే వారి, మనమంటే ఈర్శ్య కలిగిన వారి , అపవిత్రంగా జీవించే వారి, మనం అభివృద్ధి చెందకూడదు అని బలంగా కోరుకునే వారి దృష్టి ని "నర ఘోష - నజర్ - లేదా దృష్టి దోషం" అంటారు.
ఇది మనకు చెడును కలిగిస్తుందని పూర్వం నుండి పెద్దలు చెప్పే విషయం.
ఇటువంటి దృష్టి దోషాన్ని - నరఘోష ను (నజర్ ను) తొలగించే " దత్త మాలా మంత్రం " అనే ఫైల్ ను ఈ క్రింద ఇస్తున్నాను .దీన్ని ప్రతిరోజు 11 సార్లు చదవడం వల్ల ఎటువంటి దృష్టి దోషమైనా తొలిగిపోతుంది. బాగా బిజీగా ఉండేవారు కనీసం ఒకసారైనా చదువుకోండి.
సూర్యోదయం కన్నా ముందే స్నానం చేసి చదివితే మరింత మంచి ఫలితం ఉంటుంది.
1.దత్తమాలా మహా మంత్రం (ఇక్కడ నొక్కండి )
2.లేదా ఇక్కడ నొక్కి "దత్తమాలా మంత్రం "డౌన్లోడ్ చేసుకోండి
1.దత్తమాలా మహా మంత్రం (ఇక్కడ నొక్కండి )
2.లేదా ఇక్కడ నొక్కి "దత్తమాలా మంత్రం "డౌన్లోడ్ చేసుకోండి
ఇకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.
"నిరంతరం ప్రవహించే నీటి ప్రవాహానికి ఏ దోషం అంటదు. " అలాగే ఎప్పుడూ క్రియాశీలంగా - ఏక్టివ్ గా జీవించే వ్యక్తులకు కూడా ఏ దోషాలు అంటవు.
" ఆగిన నీరే మురికిగుంటగా మారి దోషాలకు నిలయమౌతుంది."
అలాగే సోమరితనం - బద్ధకం - అధిక సుఖలాలసత ...మొ॥వి మనని అభివృద్ధి మార్గంలో ఆగేటట్లుగా చేసి దోషాలకు కారణమౌతాయి. ఈ దుర్లక్షణాలను వీలైనంత తొందరగా వదిలించుకుంటే ఎప్పటికీ ఏ దోషాలు మనని అంటకుండా ఉంటాయి.
స్వస్తి
(ఓపికగా చదివిన వారికి )
ధన్యవాదములతో

No comments:
Post a Comment